దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. భారీ స్కోరు చేసిన భారత్
ABN , First Publish Date - 2022-01-21T23:34:43+05:30 IST
మూడు వన్డేల సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడి బోలండ్ పార్క్లో జరుగుతున్న రెండో
పార్ల్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడి బోలండ్ పార్క్లో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ (55), వికెట్ కీపర్ రిషభ్ పంత్ (85) అర్ధ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు సాధించి ప్రత్యర్థికి సవాలు విసిరింది.
శిఖర్ ధవన్ 29, వెంకటేశ్ అయ్యర్ 22 పరుగులు చేయగా, శార్దూల్ ఠాకూర్ (40), రవిచంద్రన్ అశ్విన్ (25) నాటౌట్గా నిలిచారు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఐదు బంతులు ఆడి డకౌట్గా వెనుదిరిగి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షంషీ రెండు వికెట్లు తీసుకోగా, సిసండ మగల, మార్కరమ్, కేశవ్ మహరాజ్, పెహలుక్వాయో చెరో వికెట్ తీసుకున్నారు.