సిరీస్ నెగ్గిన సఫారీలు.. రెండో వన్డేలోనూ భారత్ పరాజయం

ABN , First Publish Date - 2022-01-22T03:38:25+05:30 IST

పార్ల్: బోలండ్ పార్క్‌లో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా.. భారత్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. మూడు వన్డేల సిరీస్‌‌ను 2-0తో గెలుచుకుంది.

సిరీస్ నెగ్గిన సఫారీలు.. రెండో వన్డేలోనూ భారత్ పరాజయం

పార్ల్: బోలండ్ పార్క్‌లో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా.. భారత్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. మూడు వన్డేల సిరీస్‌‌ను 2-0తో గెలుచుకుంది. భారత్ నిర్దేశించిన 288 పరుగుల విజయలక్ష్యాన్ని 48.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. క్వింటాన్ డి కాక్ 78, మలన్ 91, బవుమా 35, ఎయిడెన్ 37, డుస్సెన్ 37 పరుగులు చేశారు. 


తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్ (55), వికెట్ కీపర్ రిషభ్ పంత్ (85), శిఖర్ ధవన్ 29, వెంకటేశ్ అయ్యర్ 22, శార్దూల్ ఠాకూర్ (40), రవిచంద్రన్ అశ్విన్ (25) పరుగులు చేశారు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఐదు బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరిగి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షంషీ రెండు వికెట్లు తీసుకోగా, సిసండ మగల, మార్కరమ్, కేశవ్ మహరాజ్, పెహలుక్వాయో చెరో వికెట్ తీసుకున్నారు. 



Updated Date - 2022-01-22T03:38:25+05:30 IST