పార్ల్ వన్డే: భారత్ విజయలక్ష్యం ఎంతంటే?
ABN , First Publish Date - 2022-01-19T23:45:45+05:30 IST
పార్ల్: భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న తొలి వన్డేలో సఫారీలు 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేశారు.
పార్ల్: భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న తొలి వన్డేలో సఫారీలు 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డస్సెన్ 129, టెంబా బవుమా 110 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 48 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ 53 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.