సర్వీసును క్రమబద్ధీకరించండి
ABN , First Publish Date - 2021-06-20T05:44:01+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న పారా మెడికల్ సిబ్బంది సర్వీసును క్రమబద్దీకరించాలని పొన్నాడ పీహెచ్సీ వద్ద వైద్య సిబ్బంది శనివారం ఆందోళన చేపట్టారు.
పొన్నాడ పీహెచ్సీ వద్ద వైద్య సిబ్బంది ఆందోళన
ఎచ్చెర్ల : రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న పారా మెడికల్ సిబ్బంది సర్వీసును క్రమబద్దీకరించాలని పొన్నాడ పీహెచ్సీ వద్ద వైద్య సిబ్బంది శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్పట్లో కలెక్టర్ చైర్మన్గా ఉన్న కమిటీ తమను ఎంపిక చేసిందని, అప్పటి నుంచి నిర్ణీతమైన వేతనంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది హసీనా బేగం, ఎం.ధనలక్ష్మి, ఇప్పిలి చిట్టిబాబు, కె.కోటేశ్వరరావు, ఎం.నాగేశ్వరరావు, ఎన్.శాంతమ్మ, బి.రమ తదితరులు పాల్గొన్నారు.