త్వరలో యాదాద్రికి సీఎం?

ABN , First Publish Date - 2021-05-07T09:31:39+05:30 IST

సీఎం కేసీఆర్‌ త్వరలో యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో యాదాద్రి వచ్చి లక్ష్మీ నృసింహుడిని దర్శించుకోనున్నట్టు

త్వరలో యాదాద్రికి సీఎం?

ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన


యాదాద్రి, మే 6 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ త్వరలో యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో యాదాద్రి వచ్చి లక్ష్మీ నృసింహుడిని దర్శించుకోనున్నట్టు సమాచారం. కరోనా నుంచి క్షేమంగా కోలుకున్నందున తన ఇష్టదైవం నృసింహుడికి ప్రత్యేక పూజలు చేయడమే కాకుండా, ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులు పరిశీలించడానికి ఈ పర్యటన ఉంటుందని అంటున్నారు. కొవిడ్‌ ఉధృతి దృష్ట్యా కేవలం కొద్ది మంది ముఖ్యులు మాత్రమే ఆయన వెంట ఈ పర్యటనలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీలోపు కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటిస్తారని వైటీడీఏ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

Updated Date - 2021-05-07T09:31:39+05:30 IST