కరోనా ఎఫెక్ట్: త్వరలో ఇళ్లలోంచి ఇడ్లీలు మాయం?

ABN , First Publish Date - 2020-04-09T02:21:25+05:30 IST

ఇడ్లీ.. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అనేక మంది ఉదయాన ఇడ్లీనే అల్పాహారంగా తీసుకుంటారు. కానీ కరోనా పూణ్యమా అని ఇడ్లీకి కూడా కరువచ్చే రోజులు దాపురించాయి.

కరోనా ఎఫెక్ట్: త్వరలో ఇళ్లలోంచి ఇడ్లీలు మాయం?

చెన్నై: ఇడ్లీ.. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అనేక మంది ఉదయాన ఇడ్లీనే అల్పాహారంగా తీసుకుంటారు. కానీ కరోనా పూణ్యమా అని ఇడ్లీకి కూడా కరువచ్చే రోజులు దాపురించాయి. వీటి తయారీకి వాడే మినపప్పుకు కటకట ఏర్పడటమే ఇందుకు కారణమని తమిళనాడుకు చెందిన వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రానికి దిగుమతయ్యే కంది పప్పు, మినపప్పుల్లో ప్రస్తుతం కేవలం 25 శాతం మాత్రమే దిగుమతువుతోందంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచే వీటిల్ని ఎక్కువగా తెప్పించుకుంటామని, కానీ ఆయా రాష్ట్రాల సరిహద్దులు మూసేయండో సరుకు రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. దీనికి తోడు.. వీటి స్టాక్ ఎలాగైనా పెంచుకోవాలనుకునే వ్యాపారుల వల్ల ధరలు మరింతంగా పెరిగిపోతున్నాయని అంటున్నారు.ఇక కార్మికులు, డ్రైవర్లు లేకపోవడం వంటి ఇతర సమస్యలు కూడా ధరల పెరిగడానికి కారణమని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక ఇళ్లోంచి ఇడ్లీలు మాయమవుతాయా అంటూ అక్కడి ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-04-09T02:21:25+05:30 IST