త్వరలో MP పదవికి రాజీనామా.. రఘురామ సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2022-01-07T18:56:50+05:30 IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక ప్రకటన చేశారు. ..

త్వరలో MP పదవికి రాజీనామా.. రఘురామ సంచలన ప్రకటన

న్యూఢిల్లీ/అమరావతి : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయించడానికి ఎంత సమయం కావాలో‌ చెప్పాలని ఒకింత సవాల్ విసిరారు. అంతటితో ఆగని ఆయన.. ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం రాజధాని అమరావతి ఎజెండాతో మళ్ళీ ఎన్నికలకు వెళ్తానని ప్రకటించారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో తన ఎన్నిక ద్వారా నిరూపిస్తానని చెప్పుకొచ్చారు.


ఏపీలో కొన్ని పత్రికలు, చానల్స్‌ను బ్యాన్ చేయటాన్ని ఈ సందర్భంగా రఘురామ తీవ్రంగా ఖండించారు. కాగా.. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం పార్లమెంట్ నియోజకర్గం నుంచి రఘురామ పోటీచేసి గెలిచిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే.. రఘురామ కీలక ప్రకటనపై వైసీపీ నేతలు, ముఖ్యంగా మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

Updated Date - 2022-01-07T18:56:50+05:30 IST