‘రెండు ఎంపీ స్థానాలకు ఉపఎన్నికలు’
ABN , First Publish Date - 2020-09-24T14:18:36+05:30 IST
ఈ కేసుకు సంబంధించి మరో 70 రోజుల్లో తీర్పు వచ్చే అవకాశముందని
చెన్నై : తమిళనాట నీలగిరి, తూత్తుకుడి పార్లమెంటు స్థానాలకు మరో 70 రోజుల్లో ఉపఎన్నికలు జరుగుతాయని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా జోస్యం చెప్పారు. ఆయన తిరుప్పూర్లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ... 2జీస్పెక్ట్రమ్ కుంభకోణంలో డీఎంకే ఎంపీ ఎ.రాజా(నీలగిరి), కనిమొళి(తూత్తుకుడి) మళ్లీ తీహార్ జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో 70 రోజుల్లో తీర్పు వచ్చే అవకాశముందని, ఇదే జరిగితే ఈ రెండు పార్లమెంటుస్థానాలకు ఉపఎన్నికలు కచ్చితంగా జరుగుతాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల నుంచి భారతదేశానికి వస్తువుల దిగుమతిని అడ్డుకోవడం సాధ్యం కాదని, అందువల్లే రైతులు తమ ఉత్పత్తులను అన్ని దేశాల్లోని మార్కెట్లకు ఎగుమతి చేసుకొనేలా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదింపజేసిందని రాజా అన్నారు.