Sony స్మార్ట్టీవీల విడుదల.. ధర ఎంతంటే..
ABN , First Publish Date - 2021-08-13T00:00:18+05:30 IST
జపాన్కు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ సోనీ సరికొత్త మోడళ్లలో స్మార్ట్టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ: జపాన్కు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ సోనీ సరికొత్త మోడళ్లలో స్మార్ట్టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత మార్కెట్లో హెచ్డీఎంఐ 2.1 సపోర్టుతో సోనీ బ్రావియా ఎక్స్ఆర్-77A80జే, బ్రావియా కేడీ-85ఎక్స్85జే 4కే టీవీలను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. సోనీ బ్రావియా ఎక్స్ఆర్-77A80జే టీవీ రూ. 5,49,990, బ్రావియా కేడీ-85ఎక్స్85జే 4కే టీవీ రూ.4,99,990 ఉంటుందని సంస్థ వెల్లడించింది.