'దేశ్ కే మెంటర్స్' బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్

ABN , First Publish Date - 2021-08-27T16:53:22+05:30 IST

బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను శుక్రవారంనాడిక్కడ కలుసుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న..

'దేశ్ కే మెంటర్స్' బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను శుక్రవారంనాడిక్కడ కలుసుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న 'దేశ్ కే మెంటర్స్' ప్రోగ్రాంకు బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ పనిచేయనున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రకటించారు. మీడియా సమావేశంలో ఉభయులూ పాల్గొన్నారు. త్వరలోనే ఈ ప్రోగ్రాం ప్రారంభమవుతుందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. లక్షలాది మంది విద్యర్థులకు మార్గదర్శకత్వం వహించే అవకాశం తనకు ఈరోజు లభించిందని, విద్యార్థులకు నిర్దేశం చేయడం కంటే గొప్ప సేవ ఇంకేమీ ఉండదని సోనూసూద్ అన్నారు. ముఖ్యమంత్రితో కలిసి ఈ పథకం లక్ష్యాన్ని నెరవేరుస్తామని చెప్పారు. లాక్‌ డౌన్ ప్రారంభమైనప్పుడు, అనేక మందితోతో తాను మమేకమయ్యానని, విద్య అనేది ప్రధాన అంశం అనే విషయం తాను గ్రహించామని తెలిపారు. విద్యార్థులకు భవిష్యత్తుల్లో ఏమి చేయాలో అవగాహన ఉండనప్పుడు, కుటుంబంలో ఎవరూ చెప్పేగలిగే పరిస్థితిలో లేనప్పుడు వారి పరిస్థితి ఏమిటి? అలాంటప్పుడు ఎవరో ఒకరు విద్యార్థులకు మార్గదర్శకం కావాలి. 'దేశ్ కే మెంటర్స్' ప్రోగ్రాం ఇందుకు ఉద్దేశించినదే...అని సోనూసూద్ తెలిపారు.


రాజకీయాలే అవసరం లేదు...

పార్టీ రాజకీయాల్లోకి చేరుతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సోనూసూద్ నవ్వుతూ సమాధానమిచ్చారు. ''నిరంతరం మంచి పనులు చేయాలంటే మీరు రాజకీయాల్లోకి రావాలని చాలామంది అంటుంటారు. మంచి పనులు చేయడానికి రాజకీయాలే అవసరం లేదు. నాకు అలాంటి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు'' అని సోనూసూద్ సమాధానమిచ్చారు.

Updated Date - 2021-08-27T16:53:22+05:30 IST