తండ్రి వేధింపుల వల్లే నా భార్య చనిపోయింది.. మామపై సంచలన ఆరోపణలు చేస్తూ డీఐజీ లేఖ రాసిన వ్యక్తి!

ABN , First Publish Date - 2022-02-16T19:59:53+05:30 IST

`నా భార్య గత నెలలో చనిపోయింది. తండ్రి వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుంది.

తండ్రి వేధింపుల వల్లే నా భార్య చనిపోయింది.. మామపై సంచలన ఆరోపణలు చేస్తూ డీఐజీ లేఖ రాసిన వ్యక్తి!

`నా భార్య గత నెలలో చనిపోయింది. తండ్రి వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. పండగ కోసం పుట్టింటికి వచ్చిన కూతురిని వేరే వ్యక్తికి అమ్మేందుకు ఆమె తండ్రి ప్రయత్నించాడు. వేరే వ్యక్తి దగ్గరకు వెళ్లడం ఇష్టం లేక నా భార్య ఉరేసుకుంది. ఈ ఘటనపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాల`ని ఉత్తరప్రదేశ్‌లోని మానిక్‌పూర్ జిల్లా గోండా గ్రామానికి చెందిన వ్యక్తి డీఐజీకి రాసిన లేఖ సంచలనంగా మారింది. 


గోండాకు చెందిన మహాబిన్ యాదవ్ అనే వ్యక్తి 2021లో మహాదేవి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. మకర సంక్రాంతి పండగ సందర్భంగా ఆమెను తండ్రి రాజన్ గత నెలలో పుట్టింటికి తీసుకెళ్లాడు. పది రోజుల తర్వాత జనవరి 27న ఆమె ఉరేసుకుని చనిపోయింది. ఆమె చావుకు రాజన్ కారణమంటూ మహాబిన్ తాజాగా డీఐజీకి లేఖ రాశాడు. `పెళ్లి అయిన దగ్గర్నుంచి నా భార్య మా ఇంట్లోనే ఉంది. తల్లి పిలిచినా పుట్టింటికి వెళ్లేది కాదు. తండ్రి తనను వేరే వ్యక్తికి విక్రయించాలనుకుంటున్నట్టు తను నాతో చాలా సార్లు చెప్పింది. 


ఈ ఏడాది పండుగకు రమ్మని కుటుంబ సభ్యుల నుంచి తీవ్రంగా ఒత్తిడి రావడంతో మహాదేవి పుట్టింటికి వెళ్లింది. అక్కడకు వెళ్లిన పది రోజులకు ఆత్మహత్య చేసుకుంది. ఆమె చావు వెనుక రాజన్ హస్తం ఉంది. వేరే వ్యక్తికి కూతురిని రూ.4 లక్షలకు అమ్మాలనుకున్నాడు. తండ్రి వేధింపులు భరించలేక నా భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై విచారణ జరిపి వెంటనే రాజన్‌పై చర్యలు తీసుకోవాల`ని మహాబిన్ తాజాగా డీఐజీకి లేఖ రాశాడు. 


Updated Date - 2022-02-16T19:59:53+05:30 IST