బంగ్లా విముక్తి దినోత్సవం: ఇందిరాను గుర్తు చేసుకున్న సోనియా

ABN , First Publish Date - 2021-12-16T01:14:55+05:30 IST

50 ఏళ్ల క్రితం శక్తివంతమైన వారు బంగ్లాదేశీయులకు సరికొత్త భవిష్యత్‌ను అందించారని కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ అన్నారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటం 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె పై విధంగా వ్యాఖ్యానించారు. బంగ్లా స్వాతంత్ర్యానికి భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు..

బంగ్లా విముక్తి దినోత్సవం: ఇందిరాను గుర్తు చేసుకున్న సోనియా

న్యూఢిల్లీ: 50 ఏళ్ల క్రితం శక్తివంతమైన వారు బంగ్లాదేశీయులకు సరికొత్త భవిష్యత్‌ను అందించారని కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ అన్నారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటం 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె పై విధంగా వ్యాఖ్యానించారు. బంగ్లా స్వాతంత్ర్యానికి భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. కోటి మంది శరణార్థుల వెంట భారత దేశం నిలిచిందని, బంగ్లాదేశీయులు ఇది గుర్తుంచుకోవాలని అన్నారు. ‘‘ఇందిరా గాంధీ ఆమె గొప్పతనాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమె ధైర్యసాహసాలు కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలిచాయి. అనేక విధాలుగా 1971 ఏడాది ఇందిరాకు ఎంతో ప్రత్యేకం. ఆమె బంగ్లా ప్రజల కోసం మొత్తం ప్రపంచ సమాజాన్ని చైతన్యపరిచారు’’ అని సోనియా గాంధీ అన్నారు.

Updated Date - 2021-12-16T01:14:55+05:30 IST