ఆసుపత్రి నుంచి Sonia Gandhi డిశ్చార్జి

ABN , First Publish Date - 2022-06-21T00:26:27+05:30 IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోవవారం సాయంత్రం శ్రీ గంగారామ్ ఆసుపత్రి నుంచి..

ఆసుపత్రి నుంచి Sonia Gandhi డిశ్చార్జి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం సాయంత్రం శ్రీ గంగారామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కోవిడ్ అనంతర సమస్యల కారణంగా వారం రోజులుగా ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకున్నారు. సోనియాగాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయ్యారని, ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ ఒక ట్వీట్‌లో తెలిపారు. 75 ఏళ్ల సోనియాగాంధీ జూన్ 2న కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ కోవిడ్ అనంతర సమస్యలతో గత వారంలో ఆసుపత్రిలో చేరారు.


కాగా, నేషనల్ హెరాల్డ్‌కు చెందిన మనీ లాండరింగ్ కేసులో సోనియాగాంధీ ఈనెల 23న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాల్సి ఉంది. ఇదే కేసులో రాహుల్ గాంధీని ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది.

Updated Date - 2022-06-21T00:26:27+05:30 IST