అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకుని తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లిన తల్లి.. ఆక్కణ్నుంచి పారిపోయిన కుర్రాడు ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2022-02-15T20:01:45+05:30 IST

ఆ 17 ఏళ్ల కుర్రాడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. మాత్రలు వేసుకున్నా ఫలితం కనిపించలేదు.

అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకుని తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లిన తల్లి.. ఆక్కణ్నుంచి పారిపోయిన కుర్రాడు ఎంత పని చేశాడంటే..

ఆ 17 ఏళ్ల కుర్రాడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. మాత్రలు వేసుకున్నా ఫలితం కనిపించలేదు.. దీంతో ఆ కుర్రాడి తల్లి ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది.. కుర్రాడిని అతడి దగ్గరకు తీసుకెళ్లింది.. అక్కడ పరిసరాలను చూసి భయపడిన కొడుకు పారిపోయాడు.. అతడిని తిరిగి తీసుకెళ్లేందుకు తల్లి ప్రయత్నించింది.. దీంతో తల్లిని ఆ కుర్రాడు ఓ పెద్ద బండరాయితో కొట్టి చంపేశాడు.. అనంతరం పోలీసులకు దొరికిపోయాడు. 


మధ్యప్రేదేశ్‌లోని గుణకు చెందిన పరశురామ్ అనే యవకుడు కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా అతడి పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో అతడి తల్లి గోరా బాయి ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. ఎలాంటి రోగాన్నైనా తగ్గిస్తానని చెప్పడంతో అతడి వద్దకు పరశురామ్‌ను తీసుకెళ్లింది. అయితే ఆ తాంత్రికుడిని చూసి భయపడ్డ పరశురామ్ అక్కణ్నుంచి పారిపోయాడు. అతడిని తిరిగి తీసుకొచ్చేందుకు గోరా బాయి ప్రయత్నించింది. 


తల్లి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరశురామ్ పెద్ద బండరాయి తీసుకుని తల్లి తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. చుట్టుపక్కల వ్యక్తులు పరశురామ్‌ను ఓ చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరశురామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గోరా బాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 

Updated Date - 2022-02-15T20:01:45+05:30 IST