భార్యను కాపురానికి పంపడం లేదని.. మామను ఇంటికి పిలిచి ఆ అల్లుడు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-04-13T09:09:00+05:30 IST

పెళ్లయిన తర్వాత రెండు కుటుంబాల మధ్య గొడవలు జరగడంతో.. అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్లిపోయాడు తండ్రి. ఈ విషయంపై అల్లుడు, మామయ్యకు చాలా కాలంగా గొడవ జరుగుతోంది. ఎంత అడిగినా కూతుర్ని కాపురానికి పంపకపోవడంతో అల్లుడికి కోపం వచ్చింది. దీంతో కొంచెం మాట్లాడాలని చెప్పి మామయ్యను పిలిచి..

భార్యను కాపురానికి పంపడం లేదని.. మామను ఇంటికి పిలిచి ఆ అల్లుడు ఏం చేశాడంటే..

పెళ్లయిన తర్వాత రెండు కుటుంబాల మధ్య గొడవలు జరగడంతో.. అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్లిపోయాడు తండ్రి. ఈ విషయంపై అల్లుడు, మామయ్యకు చాలా కాలంగా గొడవ జరుగుతోంది. ఎంత అడిగినా కూతుర్ని కాపురానికి పంపకపోవడంతో అల్లుడికి కోపం వచ్చింది. దీంతో కొంచెం మాట్లాడాలని చెప్పి మామయ్యను పిలిచి.. బండరాయితో అతని తల పగలగొట్టి చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. 


మధ్యప్రదేశ్‌లోని షారాపూర్‌కు చెందిన రాహుల్ అనే యువకుడికి మూడేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లి జరిగిన కొంతకాలం తర్వాత ఇంటికొచ్చిన మామ రమేష్.. కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లిపోయాడు. తనకు డబ్బులు ఇస్తేనే కూతున్ని కాపురానికి పంపుతానని తేల్చిచెప్పేశాడు. ఎంత చెప్పినా రమేష్ తన మాట వినకపోవడంతో రాహుల్‌కు కోపం వచ్చింది. తన సోదరుడు నితేష్, అతని మిత్రులకు విషయం చెప్పి బాధపడ్డాడు. ఈ క్రమంలోనే వాళ్లందరూ కలిసి రమేష్ అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేశారు. దాని ప్రకారమే సారంగాపూర్ వస్తే డబ్బుల విషయం మాట్లాడదామని చెప్పారు. దాంతో అక్కడకు వచ్చిన రమేష్‌ను బండరాయితో తల పగలగొట్టి చంపేశారు. 


హత్య విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తులో మామ, అల్లుళ్ల మధ్య గొడవ గురించి వారికి తెలిసింది. వెంటనే అల్లుడు రాహుల్‌ను అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దాంతో రాహుల్ సహా మొత్తం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


Updated Date - 2022-04-13T09:09:00+05:30 IST