ఆస్ట్రేలియాలో కొడుకు.. వృద్ధాశ్రమంలో తల్లి
ABN , First Publish Date - 2020-06-07T15:21:26+05:30 IST
ఈ వృద్ధురాలి పేరు రామతులసమ్మ.. కర్నూలు పట్టణంలోని వెంగన్నబాయి ప్రాంతం లో నివాసం.
హైదరాబాద్/డోన్ : ఈ వృద్ధురాలి పేరు రామతులసమ్మ.. కర్నూలు పట్టణంలోని వెంగన్నబాయి ప్రాంతం లో నివాసం. భర్త అంజనేయులు 30 ఏళ్ల కిందటే చనిపోయాడు. ఉన్న ఒక్క కొడుకు సత్యప్రభ ఆస్ట్రేలియాలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సత్యప్రభ భార్య పిల్లలు కర్నూల్లోనే ఉంటున్నారు. కోడలు సరిగ్గా చూడడం లేదని కొడుకు కర్నూల్లోని ఒక ఆశ్రమంలో తల్లిని చేర్పించి వెళ్లిపోయాడు.
వివిధ కారణాలతో ఆశ్రమం మూత పడడంతో ఆ వృద్ధురాలు రోడ్డున పడింది. రెండు రోజుల క్రితం కర్నూలు నుంచి బస్సులో ప్రయాణించి డోన్ కొత్తబస్టాండుకు చేరుకుంది. కొత్తబస్టాండులో ఆకలితో అలమటిస్తూ వృద్ధురాలి పడుతున్న దీనస్థితిని చూసి పట్టణంలోని వైఎస్ నగర్లోని హోసన్న వృద్ధాశ్రమానికి శనివారం సమాచారం అందించారు. ఆశ్రమ నిర్వాహకులు జాన్ ప్రభాకర్ కొత్తబస్టాండుకు చేరుకొని వృద్ధురాలిని ఆశ్రమానికి తీసుకెళ్లారు.