రోడ్డు ప్రమాదంలో కుమారుడి దుర్మరణం
ABN , First Publish Date - 2021-02-28T06:03:34+05:30 IST
చీమకుర్తి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బేల్దారి పనులు చేసుకునే యువకుడు మృతి చెందగా, ఆయన తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు.
తండ్రి పరిస్థితి విషమం
బైక్ను ఢీకొట్టిన గ్రానైట్ ట్రాలీ
చీమకుర్తి, ఫిబ్రవరి 27 : చీమకుర్తి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బేల్దారి పనులు చేసుకునే యువకుడు మృతి చెందగా, ఆయన తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శనివారం ఉదయం జ రిగింది. ఎస్ఐ నాగశివారెడ్డి తెలిపిన వివరాల మేరకు చీమకుర్తి పట్టణం హిమగిరికాలనీకి చెందిన తం డ్రీకుమారులు సుబ్బారావు, ఏసుబాబు (19) బేల్దార్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో పనులు నిమిత్తం తమ ద్విచక్రవాహనంపై చీమకుర్తికి బయలుదేరారు. పట్టణ శివారు కారుమంచి మేజర్ స మీపంలోకి వచ్చే సరికి చీమకుర్తి వైపు వస్తున్న గ్రానైట్ట్రాలీ వేగంగా వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఏసుబాబు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతని తండ్రి సుబ్బారావుకు తీ వ్రగాయాలు కావడంతో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో గుం టూరుకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి విచారణ జరుపతున్నట్లు ఎస్ఐ నాగశివారెడ్డి తెలిపారు.