ఏడుస్తున్నా పట్టించుకోకుండా తండ్రితో కలిసి తల్లిని నడిరోడ్డుపై కొట్టిన కొడుకు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-25T22:32:39+05:30 IST

ఆ తల్లి కొడుకు, భర్తతో కలిసి రోడ్డుపై వెళుతోంది. సడన్‌గా ఆమెను కిందపడేసి కొడుకు కొడుతుండగా.. దానికి తండ్రి కూడా తోడయ్యాడు. తల్లి అని కూడా చూడకుండా

ఏడుస్తున్నా పట్టించుకోకుండా తండ్రితో కలిసి తల్లిని నడిరోడ్డుపై కొట్టిన కొడుకు.. అసలేం జరిగిందంటే..

రాజస్థాన్: ఆ తల్లి కొడుకు, భర్తతో కలిసి రోడ్డుపై వెళుతోంది. సడన్‌గా ఆమెను కిందపడేసి కొడుకు కొడుతుండగా.. దానికి తండ్రి కూడా తోడయ్యాడు. తల్లి అని కూడా చూడకుండా నడిరోడ్డుపై ఆమెను చావబాదాడు. ఆమె ఎంత ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఇద్దరూ కలిసి ఆమెపై దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఆమెను కొట్టడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకెళ్లాల్సిందే..


బర్మర్‌లోని భడి గ్రామానికి చెందిన పప్పుదేవి అనే మహిళ భర్త మోహన్‌లాల్, ఇద్దరు కొడుకులతో కలిసి నివాసముంటోంది. బుధవారం పప్పుదేవి, ఆమె భర్త ఏదో విషయంపై గొడవపడ్డారు. అప్పటినుంచి వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పనిమీద పప్పుదేవి కొడుకు, భర్తతో కలిసి బైక్‌పై బయటికివెళ్లింది. అక్కడ కూడా భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే కొడుకు తల్లిని బైక్ మీద నుంచి కిందపడేసి నడిరోడ్డుపై ఆమెను గొడ్డును బాదినట్టు బాదాడు. ఇది చూసిన తండ్రి కొడుకును వారించాల్సింది పోయి భార్యను కాలితో తన్ని, తీవ్రంగా హింసించాడు. ఆ సమయంలో ఆమె తనని తాను కాపాడుకోవడానికి వారిపై రాళ్లు రువ్వింది. అయినా వారు ఆమెను వదలకుండా పిడిగుద్దులు గుద్దారు. ఈ సన్నివేశాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ప్రస్తుతం వైరల‌్‌గా మారింది.


బాధితురాలు పప్పుదేవి మాట్లాడుతూ.. భర్త, కొడుకు తనపై దాడిచేసిన అనంతరం వారిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు తెలిపింది. కానీ పోలీసులు రాత్రి వరకు కేసు నమోదు చేయలేదని చెప్పింది. ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవడంతో అప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి భర్త, కొడుకు కోసం గాలిస్తున్నారని ఆమె చెప్పింది.

Updated Date - 2021-11-25T22:32:39+05:30 IST