జగన్ కేబినెట్లో మంత్రులకు పవర్ ఉందా?: సోము వీర్రాజు
ABN , First Publish Date - 2022-04-11T23:06:59+05:30 IST
అవినీతిలో కూరుకుపోయిన వారిని..కేబినెట్లోకి తీసుకున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
అమరావతి: అవినీతిలో కూరుకుపోయిన వారిని..కేబినెట్లోకి తీసుకున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కేబినెట్లో మంత్రులకు పవర్ ఉందా? అని ప్రశ్నించారు. బీసీలకు జగన్ సీఎం పదవి ఇవ్వగలరా? అని నిలదీశారు.టీడీఆర్ స్కాంలో ఉన్న కారుమూరికి పదవా? అని నిలదీశారు.పాత హోంమంత్రి సుచరిత డీఎస్పీనైనా బదిలీ చేశారా? వనిత కానిస్టేబుల్ని అయినా బదిలీ చేయగలరా? అని సోమువీర్రాజు ఎద్దేవా చేశారు.