రాష్ట్రంలో గతి, మతి లేని పాలన: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-04-04T00:47:20+05:30 IST

రాష్ట్రంలో గతి, మతి లేని పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో గతి, మతి లేని పాలన: సోము వీర్రాజు

పాడేరు: రాష్ట్రంలో గతి, మతి లేని పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా రాష్ట్రం ప్రచారం చేసుకుంటోందని, దానిని తాము ఖండిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఈ రాష్ట్రానికి వచ్చినన్ని నిధులు మరే రాష్ట్రానికీ రాలేదన్నారు. అలాగే ప్రత్యేక హోదాకు బదులుగా ఇచ్చిన కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని జగన్‌ అప్పుల పాల్జేస్తున్నారని, ఎటువంటి అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని సోము వీర్రాజు దుయ్యబట్టారు. 

Updated Date - 2022-04-04T00:47:20+05:30 IST