విజయవాడ: బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహా మృత్యుంజయ జపం

ABN , First Publish Date - 2022-01-07T18:38:08+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహా మృత్యుంజయ జపం నిర్వహించారు.

విజయవాడ: బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహా మృత్యుంజయ జపం

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా  బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహా మృత్యుంజయ జపం నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ పంజాబ్ పర్యటనలో కాంగ్రెస్ ప్రభుత్వ దమన కాండను దేశం మొత్తం గమనించిందన్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని హెలికాఫ్టర్‌లో వెళ్లాల్సి ఉన్నా.. రోడ్డు మార్గాన పంపారని విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో దేశం అవినీతి కూపంలో కూరుకుపోయిందన్నారు. మోదీ హయాంలో అవినీతికి ఆస్కారం లేకుండా పాలన సాగిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ చూసి ఓర్వలేకపోతోందన్నారు. పంజాబ్ ఘటనను నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర గవర్నర్‌ను కలుస్తామన్నారు. 13వ తేదీ వరకు నిరసనలు కొనసాగిస్తామన్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అవకాశవాదని ఆరోపించారు. ఎవరినైనా లవ్ చేస్తారని, ఆ తర్వాత వదిలేస్తారని, అది ఆయన నైజమని సోము వీర్రాజు విమర్శించారు.

Updated Date - 2022-01-07T18:38:08+05:30 IST