అంబేద్కర్ దేశ రక్షకుడు.. దేశానికి ఎనలేని సేవ చేశారు: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-05-25T18:31:04+05:30 IST

కోనసీమలో చిచ్చుని రాష్ట్ర ప్రభుత్వమే తెరలేపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.

అంబేద్కర్ దేశ రక్షకుడు.. దేశానికి ఎనలేని సేవ చేశారు: సోము వీర్రాజు

విశాఖపట్నం : కోనసీమలో చిచ్చుని రాష్ట్ర ప్రభుత్వమే తెరలేపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇల్లు దహనం చేయడాన్ని ఖండించారు. యువత ఆగ్రహావేశాలకు లోను కావద్దన్నారు. ఇటువంటి ఉద్యమాల్లో బీజేపీ ఎటువంటి పాత్ర పోషించడం లేదన్నారు. దేశంలో అంబేద్కర్ పంచ తీర్ధాన్ని మోదీ ఏర్పాటు చేశారన్నారు. ఆయన దేశానికి ఎనలేని సేవలు చేశారని సోము వీర్రాజు పేర్కొన్నారు. అంబేద్కర్ దేశ రక్షకుడన్నారు. 125 అడుగుల విగ్రహాన్ని పెడతామని గత ప్రభుత్వం చెప్పిందని.. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వ డబ్బులతో చర్చ్‌లు కడుతున్నారన్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహాలను పెడితే.. ప్రజల్లోకి ఎటువంటి సందేశాలు వెళ్తాయని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలభిస్తోందని సోము వీర్రాజు పేర్కొన్నారు.


Updated Date - 2022-05-25T18:31:04+05:30 IST