తూర్పుగోదావరి: అధికారంలోకి రాగానే మిల్లర్లపై చర్యలు: AP BJP రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
ABN , First Publish Date - 2022-05-16T19:07:57+05:30 IST
తాము అధికారంలోకి రాగానే బియ్యం రీసైక్లింగ్కు పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.
తూర్పుగోదావరి (kakinada): తాము అధికారంలోకి రాగానే బియ్యం రీసైక్లింగ్కు పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ జేఎన్టీయూ సమీపంలో మసీదు స్థలం కోర్టు పరిధిలో ఉందని, దానిపై కాకినాడ నగర ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం తప్ప ఉత్తరాంధ్ర , రాయలసీమలో ఒక్క ప్రాజెక్ పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసులను వెంట బెట్టుకుని గడప గడపకు వైసీపీ కార్యక్రమం చేపట్టాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. వైసీపీకి తామే నిజమైన ప్రతిపక్షం అని సోము వీర్రాజు పేర్కొన్నారు.