ప్రభుత్వం బెట్టు మాని ఒక మెట్టు దిగి వ్యవహరించాలి: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2022-04-03T16:49:12+05:30 IST

అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం ఒక షెడ్యూల్ ప్రకారం హామీలు అమలు చేయాలని సోము వీర్రాజు అన్నారు.

ప్రభుత్వం బెట్టు మాని ఒక మెట్టు దిగి వ్యవహరించాలి: సోమువీర్రాజు

విజయవాడ: అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం ఒక షెడ్యూల్ ప్రకారం హామీలు అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సీఆర్డీయే పరిధిలో ఇచ్చిన ప్లాట్లకు పనులు పూర్తి చేసి ఇవ్వాలని, అందుకు తగిన సమాధానం ప్రభుత్వం నుంచి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వందల రోజులు రాజధాని రైతులు ఉద్యమాలు చేస్తున్నారని, ప్రభుత్వం బెట్టు మాని ఒక మెట్టు దిగి వ్యవహరించాలని సూచించారు. రాజధాని రైతులకు సమయపాలనతో కూడిన షెడ్యూల్ ఇచ్చి సమస్య పరిష్కారం చేయాలన్నారు. రాజధాని రైతుల సమస్య సజీవంగా ఉంచే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే రైతుల సమస్యలు ఒక టైమ్ షెడ్యూల్ ప్రకారం పరిష్కరిస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-03T16:49:12+05:30 IST