సరైన అంచనాలు లేకుండా వరికి మద్దతు ధర రూ.100 పెంచారు..: Somireddy

ABN , First Publish Date - 2022-06-09T19:38:48+05:30 IST

వరికి కనీస మద్దతు ధర పెంపును స్వాగతిస్తున్నామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

సరైన అంచనాలు లేకుండా వరికి మద్దతు ధర రూ.100 పెంచారు..: Somireddy

Amaravathi: వరికి కనీస మద్దతు ధర పెంపును స్వాగతిస్తున్నామని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సరైన అంచనాలు లేకుండా వరికి రూ.100 పెంచారని విమర్శించారు. మిగతా పంటలదీ అదే పరిస్థితని అన్నారు. కనీస మద్దతు ధర రూ.500 పెంచి ఉంటే.. రైతులకు కొంతైనా ఉరట లభించేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కౌలు రైతులైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో అయితే రైతుకు మద్దతు ధర లభించదో అక్కడి ప్రభుత్వంపై చర్యలు తీసుకునే పరిస్థితి రావాలని సోమిరెడ్డి అన్నారు.

Updated Date - 2022-06-09T19:38:48+05:30 IST