ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్ అని వైసీపీ ఎంపీ చెప్పింది అక్షరసత్యం: సోమిరెడ్డి
ABN , First Publish Date - 2022-05-19T16:01:37+05:30 IST
ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్ అని వైసీపీ ఎంపీ బోస్ చెప్పింది అక్షరసత్యమని మాజీ మంత్రి సోమిరెడ్డి ట్విటర్ వేదికగా తెలిపారు.
అమరావతి : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్ అని వైసీపీ ఎంపీ బోస్ చెప్పింది అక్షరసత్యమని మాజీ మంత్రి సోమిరెడ్డి ట్విటర్ వేదికగా తెలిపారు. కోనసీమలోనే కాదు నెల్లూరులో బస్తాకు రూ.300కు పైగా దోచేశారన్నారు. వైసీపీ నేతలు, దళారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతుల పుట్టి ముంచేశారన్నారు. మూడేళ్ల జగన్ రెడ్డి పాలనలో ఒక్క నెల్లూరులోనే రూ.3 వేల కోట్లు దోచుకున్నారన్నారు. ఈ స్కామ్పై సీఐడీ కాదు సీబీఐ లేదా జ్యూడిషియల్ ఎంక్వయిరీ జరిపితేనే నిజాలు నిగ్గుతేలుతాయని సోమిరెడ్డి తెలిపారు.