కరోనాతో ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-02-25T05:40:39+05:30 IST
జిల్లాలో కరోనాతో ఒకరు మృతి(76) చెందారు. జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి, బంగారం వ్యాపారి బుఽదవారం రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 24: జిల్లాలో కరోనాతో ఒకరు మృతి(76) చెందారు. జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి, బంగారం వ్యాపారి బుఽదవారం రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 46కు చేరింది. అలాగే, జిల్లాలో కొత్తగా మరో 19 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని, ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు.