వాహనం ఢీకొని ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-02-20T06:50:16+05:30 IST
ఉల్లంపర్రు ఇటుక బట్టీల సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదం లో పోడూరు మండలం జిన్నూరు
పాలకొల్లు రూరల్, ఫిబ్రవరి 19: ఉల్లంపర్రు ఇటుక బట్టీల సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదం లో పోడూరు మండలం జిన్నూరు గ్రామానికి చెందిన కర్రి శ్రీనివాస్ (35) మృతి చెందాడు. శ్రీనివాస్ పాలకొల్లు లోని ఒక గొడౌన్లో గుమాస్తాగా పని చేస్తున్నాడు. అతడికి భార్య రామలక్ష్మి, కుమారుడు గగన్ ఉన్నారు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో జిన్నూరు నుంచి మోటార్ సైకిల్పై పాలకొల్లు వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పాలకొల్లు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్టు ఎస్ఐ పి.అప్పారావు తెలి పారు. శ్రీనివాస్ తమ్ముడు రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అప్పారావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.