క్రిమిసంహారక మందు తాగి ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-03-08T04:42:18+05:30 IST

ఝరీ(బి) గ్రామానికి చెందిన కండేకర్‌ బాలాజీ (38) జీవితంపై విరక్తి చెంది క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పా ల్పడ్డాడు.

క్రిమిసంహారక మందు తాగి ఒకరి మృతి

తానూర్‌, మార్చి6:  ఝరీ(బి)  గ్రామానికి చెందిన కండేకర్‌ బాలాజీ (38) జీవితంపై విరక్తి చెంది క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఎస్సై రాజన్న కథనం ప్రకారం.. మృతుడు మద్యానికి బానిసై పని చేయకుండా తిరుగుతుండేవాడు. గత నెల 27న రాత్రి బాలాజీ తాగి భా ర్యను తిట్టాడు. అతడి తండ్రి కలుగజేసుకొని ఎందుకు వేధిస్తున్నావని మం దలించాడు. 28న ఇంటి నుంచి వెళ్లిపోయి తండ్రికి ఫోన్‌ చేసి బోల్స శివారు లో క్రిమిసంహారక మందు తాగినట్లు చెప్పాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అక్కడికి వెళ్లి చికిత్స నిమిత్తం భైంసా ఆసుపత్రికి అక్కడి నుంచి నిజా మాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందా డు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-03-08T04:42:18+05:30 IST