కొద్ది గంటల్లో పెళ్లి అవబోతోందని సంతోషంగా ఉన్న వధువుపై సడన్గా దాడి.. ఇంతకీ అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-05-16T20:54:19+05:30 IST
ఆమెకు పెళ్లి నిశ్చయమైంది.. మరికొద్ది గంటల్లో పెళ్లి కాబోతోంది.. ఊరేగింపునకు సర్వం సిద్ధమైంది..
ఆమెకు పెళ్లి నిశ్చయమైంది.. మరికొద్ది గంటల్లో పెళ్లి కాబోతోంది.. ఊరేగింపునకు సర్వం సిద్ధమైంది.. ఆ సమయంలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వధువు తండ్రి వద్దకు వెళ్లి డీజే ఏర్పాటు చేయాల్సిందిగా అడిగారు.. సౌండ్ బాక్సులు తెచ్చి రూ.10 వేలు డిమాండ్ చేశారు.. తమ దగ్గర అంత డబ్బు లేదని, డీజే వద్దని వధువు తండ్రి చెప్పడంతో వారు ఆగ్రహం చెందారు.. పెళ్లి మండపంలోకి ప్రవేశించి దాడికి తెగబడ్డారు.. వధువుతో సహా నలుగురిని కొట్టారు.
బీహార్లోని నవడాకు చెందిన రాధే చౌహాన్ కుమార్తె సంగీత కుమారికి ఆదివారం వివాహం నిశ్చయించారు. వధువు ఊరేగింపుగా కల్యాణ మండపానికి బయల్దేరింది. ఆ సమయంలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఊరేగింపులోకి వచ్చి పెళ్లిలో డీజే ఏర్పాటు చేయాలని అడిగారు. పొలం అమ్మి తమ కూతురికి పెళ్లి చేస్తున్నామని, డీజే ఏర్పాటు చేయలేమని వధువు తరఫు వారు వారికి చెప్పారు. అయినా వారు వినకుండా సౌండ్ బాక్సులను ఉరేగింపులోకి తీసుకెళ్లి రూ.10 వేలు డిమాండ్ చేశారు.
ఆ డబ్బులు ఇచ్చేందుకు వధువు తండ్రి నిరాకరించారు. దీంతో నిందితులంతా వధువు ఇంట్లోకి ప్రవేశించి వస్తువులన్నింటినీ ధ్వంసం చేయడం ప్రారంభించారు. అక్కడ ఉన్న వధువుతో పాటు మరో నలుగురిని గాయపరిచారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.