గిరిజనుల సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2020-08-10T10:30:58+05:30 IST
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎ.శివప్రసాద్ డిమాండ్ చేశారు.
నెల్లిమర్ల, ఆగస్టు 9: గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎ.శివప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక రామతీర్థం జంక్షన్లో కొమరంభీమ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మైదాన ప్రాంత గిరిజన సంఘం ఆధ్వర్యంలో నెల్లిమర్లలో ర్యాలీ నిర్వహించారు. సారిపల్లి పంచాయతీ నీలంరాజు పేటలో 94 గిరిజన కుటుంబాలకి గతంలో ఇచ్చిన గెడ్డ పోరంబోకు స్థలాలను అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకోవడం దారుణమన్నా రు.
ఈ కార్యక్రమంలో పూడిరాజు, జె.రామారావు, తౌడే, చిప్పిలి నాగేశ్వరరావు, గడపర్తి శ్రీనివాసరావు, బి.లక్ష్మణరావు, ఎం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ విజయనగరం దాసన్నపేట: పాలకులు మారినా.. గిరి పుత్రులు తలరాతలు మారడం లేదని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పాండ్రంకి వెంకట రమణ చెప్పారు. కంటోన్మెంట్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో బీర్సా ముండా, కొమరంభీం చిత్ర పటాల కు పూలమాల వేసి నివాళి ఆర్పించారు. నేటికీ ఆదివాసీ ప్రాంతాలు అభి వృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. డోలీల్లో వెళ్తూ ఆకుపసర్లతో సరిపెట్టుకుంటున్నా రన్నారు. మరోవైపు అటవీ సంపద, సరుకును కొందరు పొందుతూ గిరి జనులను మోసం చేస్తున్నారన్నారు. గిరిజన విశ్వవిద్యా లయంపై అధికా రులు దృష్టి సారిం చాలని కోరారు. పార్టీ ప్రధాన కార్య దర్శి సోములు తది తరులు పాల్గొన్నారు.