రైతుల సమస్యలను పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-02-27T06:04:26+05:30 IST

రైతుభరోసా కేంద్రంలో ఉంటూ రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆ శాఖ సహాయ సంచాలకుడు ఎం.రామారావు ఆదేశించారు.

రైతుల సమస్యలను పరిష్కరించండి
సమావేశంలో మాట్లాడుతున్న ఏడీ రామారావు

వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు రామారావు


తుమ్మపాల (అనకాపల్లి), ఫిబ్రవరి 26: రైతుభరోసా కేంద్రంలో ఉంటూ రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆ శాఖ సహాయ సంచాలకుడు ఎం.రామారావు ఆదేశించారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవోలు, సిబ్బందితో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ శాఖాధికారులు గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. అలాగే కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ గ్రూపు గురించి వివరించారు. ఈ గ్రూపు ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లను అద్దెకు ఇవ్వవచ్చని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు సి.రామపద్మలత, సిహెచ్‌.నాగసాయిపావని, జి.హరికృష్ణ, సుమంత, ఎం.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T06:04:26+05:30 IST