ప్రజలతో కలిసి సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2020-07-01T10:22:20+05:30 IST
ప్రజలతో కలిసి సమ స్యల పరిష్కారానికి పాటుపడాలని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కార్యకర్తలకు సూచించారు.
తాడేపల్లిగూడెం రూరల్, జూన్ 30: ప్రజలతో కలిసి సమ స్యల పరిష్కారానికి పాటుపడాలని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కార్యకర్తలకు సూచించారు. తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పట్టణ ఓబీసీ మో ర్చా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
కేంద్రంలో ఐదున్నర దశాబ్దాలపాటు కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతి పాలన సాగించాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పక్షపాత పాలన సాగిస్తోందన్నారు. అనంతరం నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర కార్యవవర్గ సభ్యులు గమిని సుబ్బారావు, కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు, ఎ. బాలకృష్ణ పాల్గొన్నారు.