ఏటికొప్పాక షుగర్స్ సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2021-06-13T05:30:00+05:30 IST
ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీలో సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘం ప్రతినిధులు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ను కోరారు.
ఎమ్మెల్యే గణేశ్కు కార్మిక సంఘం ప్రతినిధుల వినతిన
ఎస్.రాయవరం, జూన్ 13 : ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీలో సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘం ప్రతినిధులు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ను కోరారు. ఈ మేరకు ఆదివారం ఫ్యాక్టరీ కార్మిక సంఘం మాజీ వర్క్మెన్ డైరెక్టర్ రుత్తల నారాయణమూర్తి, అఽధ్యక్షుడు నగిరెడ్డి అప్పారావు, సెక్రటరీ దారా పోలయ్య, కోశాధికారి కాండ్రకోట సత్యనారాయణ, సభ్యుడు కేవీఎస్ఎన్ రాజు తదితరులు నర్సీపట్నం వెళ్లి ఎమ్మెల్యేను కలిశారు. 2021-22 సీజన్కు సంబంధించి ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్ జరిపేందుకు, కార్మికుల జీత బకాయిలు చెల్లింపులకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.