ఏటికొప్పాక షుగర్స్‌ సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-06-13T05:30:00+05:30 IST

ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీలో సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘం ప్రతినిధులు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ను కోరారు.

ఏటికొప్పాక షుగర్స్‌ సమస్యలు పరిష్కరించండి
ఎమ్మెల్యేకు వినతిపత్రం అందిస్తున్న సంఘం ప్రతినిధులు


  ఎమ్మెల్యే గణేశ్‌కు కార్మిక సంఘం ప్రతినిధుల వినతిన

ఎస్‌.రాయవరం, జూన్‌ 13 : ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీలో సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘం ప్రతినిధులు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ను కోరారు. ఈ మేరకు ఆదివారం ఫ్యాక్టరీ కార్మిక సంఘం మాజీ వర్క్‌మెన్‌ డైరెక్టర్‌ రుత్తల నారాయణమూర్తి, అఽధ్యక్షుడు నగిరెడ్డి అప్పారావు, సెక్రటరీ దారా పోలయ్య, కోశాధికారి కాండ్రకోట సత్యనారాయణ, సభ్యుడు కేవీఎస్‌ఎన్‌ రాజు తదితరులు నర్సీపట్నం వెళ్లి ఎమ్మెల్యేను కలిశారు. 2021-22 సీజన్‌కు సంబంధించి ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్‌ జరిపేందుకు, కార్మికుల జీత బకాయిలు చెల్లింపులకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-06-13T05:30:00+05:30 IST