కేజీబీవీలో సమస్యలు పరిష్కరిస్తా

ABN , First Publish Date - 2022-07-07T04:56:55+05:30 IST

కేజీబీవీ పాఠశా లలో సమస్యలు పరిష్కరిస్తామని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు.

కేజీబీవీలో సమస్యలు పరిష్కరిస్తా
పాఠశాలలో సమస్యలను తెలుసుకుంటున్న జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి

 - జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి

- ఘణపూర్‌ పాఠశాల పరిశీలన

వనపర్తి రూరల్‌, జూలై6: కేజీబీవీ పాఠశా లలో సమస్యలు పరిష్కరిస్తామని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఘణపూర్‌ మండలంలోని కేజీబీవీ ఉర్దూ, ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలను పరిశీలించా రు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యుత్‌, డ్రైనే జీ, తాగునీటి సమస్య ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌  మా ట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా రూ. 10లక్షల నిధుల ను జిల్లా పరిషత్‌ నుంచి మంజూరు చేస్తామని అన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సమ్యా నాయక్‌, నాగరాజు, పాఠశాల ఉపాధ్యాయులు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T04:56:55+05:30 IST