శ్మశానానికి దారి లేక అవస్థలు
ABN , First Publish Date - 2021-11-28T02:55:34+05:30 IST
శ్మశానానికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని కడివేడు గ్రామ దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిల్లకూరు, నవంబరు 27: శ్మశానానికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని కడివేడు గ్రామ దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాలను పొలాల్లోంచి తీసుకెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. అధికారులు పరిశీలించి స్మశానికి దారి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.