సమస్యల పరిష్కారానికి కృషి
ABN , First Publish Date - 2022-06-29T04:28:26+05:30 IST
కోవూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అన్నారు.
వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి
కోవూరు, జూన్28: కోవూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అన్నారు. స్థానిక రుక్మిణీ కల్యాణమండపంలో మంగళవారం జరిగిన వైసీపీ నియోజకవర్గ ప్లీనరీ సమవేశంలో ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి వైసీపీ నాయకులందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మాట్లాడుతూ రూ.100కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనలో జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే అగ్రభాగాన ఉంటారన్నారు. ప్లీనరీ సమావేశంలో ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టకూరు చిరంజీవి రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహామండలి ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజనబాబురెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, పడుగుపాడు సొసైటీ ఛైర్మన్ రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి , జడ్పీటీసీ కవరగిరి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.