ఎన్టీఆర్కు ఘన నివాళులు
ABN , First Publish Date - 2021-01-19T06:38:47+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్.టి. రామారావు 25వ వర్ధంతిని సోమవారం నిర్మల్లో ఘనంగా నిర్వహించారు.
నిర్మల్ కల్చరల్, జనవరి 18 : మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్.టి. రామారావు 25వ వర్ధంతిని సోమవారం నిర్మల్లో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్చైర్మన్ జి.ఈశ్వర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. రాజకీయ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహావ్యక్తి అని ఎన్టీఆర్ సేవలను కొనియాడారు.
ఖానాపూర్ రూరల్ : ఖానాపూర్ు మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ వర్దంతి నిర్వహించారు. ఈ సందర్బంగా విగ్రహానికి పూలంకరణ చేసి నివాళులర్పించారు. ఆయన తెలుగు రాష్ట్రాలకు కీర్తి ప్రతి ష్టలు తీసుకువచ్చిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో నాయకులు బూసి నరేందర్, పన్నెల వెంకట్రాములు, రాకేశ్, ప్రబాకర్, బిక్కిరాజన్న, శివ తదితరులు పాల్గొన్నారు.