శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి ఘన నివాళి

ABN , First Publish Date - 2021-06-24T04:58:17+05:30 IST

ఏక్‌ దేశ్‌ మే దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్‌ నహీ చలేగా అని నినదించిన మహోన్నతుడు జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ చంద్రారెడ్డి అన్నారు.

శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి ఘన నివాళి
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి

    గద్వాల టౌన్‌/ ధరూరు/ ఉండవల్లి/ గట్టు/ అయిజ/ వడ్డేపల్లి, జూన్‌ 23 : ఏక్‌ దేశ్‌ మే దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్‌ నహీ చలేగా అని నినదించిన మహోన్నతుడు జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ చంద్రారెడ్డి అన్నారు. శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిం చారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసు కున్నారు. కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయ కుడు అప్సర్‌ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, చిలివేరి జగన్నాథం, బండల వెంకట్రా ములు,  మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కృష్ణ వేణి, ప్రధాన కార్యదర్శి రవి, బీజేవైఎం జిల్లా అధ్యక్షు డు వెంకటేశ్వర రెడ్డి, కౌన్సిలర్‌ జయశ్రీ  పాల్గొన్నారు. 


- జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బీజేపీ ధరూరు మండల అధ్యక్షుడు రాజేష్‌ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్య క్షుడు కిష్టన్న, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు డీవై రాము, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కట్టెన్న, ఉపసర్పంచ్‌ సవారన్న, యువజన మోర్చా మండల అధ్యక్షుడు అంజి, కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షుడు వేమారెడ్డి, బీసీ మోర్చా మండల అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు సుజాతమ్మ,  రామిరెడ్డి, రాజ్‌కుమార్‌, లక్ష్మన్న పాల్గొన్నారు.


- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌ను పురస్కరించుకొని బీజేపీ ఉండవల్లి మండల అధ్య క్షుడు పిడుగు వెంకటేష్‌ ఆయన చిత్రపటానికి బుధవారం పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్య క్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మహేంద్ర, నా యకులు గుర్నాథ్‌రెడ్డి, వెంకటేష్‌ గౌడు, విజయ్‌ కుమార్‌, స్వామి, సాయి యాదవ్‌, లోకేష్‌ పాల్గొన్నారు.


- జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా గట్టులో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బల్గెర శివారెడ్డి, యువమోర్చా అధ్యక్షుడు కొళాయి భాస్కర్‌, సీనియర్‌ నాయకుడు మధుసూదన్‌రావ్‌, వెం కటేష్‌, అలూరు నర్సింహులు, తిమ్మప్ప పాల్గొన్నారు.


- బీజేపీ అయిజ మండల అధ్యక్షుడు శేఖర్‌ అధ్వర్యంలో శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని నిర్వహిం చారు. కార్యక్రమానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగేంద్రంయాదవ్‌ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు జలగరి అశోక్‌, గోపాలకృష్ణ, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


- దివంగత శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి బీజేపీ వడ్డేపల్లి నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరసింహ, మధుసూదన్‌ గౌడు, శ్రీను, రామాంజనేయులు, జ్యోతి, రాధన్న తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T04:58:17+05:30 IST