హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడిన వరుణ్‌సింగ్‌కు 45శాతం కాలిన గాయాలు

ABN , First Publish Date - 2021-12-09T16:44:42+05:30 IST

ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ప్రమాదంలో బయటపడిన శౌర్యచక్ర అవార్డు గ్రహీత, ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ 45 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్నాడని వైద్యులు చెప్పారు....

హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడిన వరుణ్‌సింగ్‌కు 45శాతం కాలిన గాయాలు

బెంగళూరుకు తరలించేందుకు సన్నాహాలు

వెల్లింగ్టన్(తమిళనాడు): ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ప్రమాదంలో బయటపడిన శౌర్యచక్ర అవార్డు గ్రహీత, ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ 45 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్నాడని వైద్యులు చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరుణ్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.ఈయన ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఐఏఎఫ్‌ ట్వీట్‌ చేసింది. వరుణ్ సింగ్ ను మెరుగైన వైద్యం అందించడం కోసం అతన్ని బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్‌ కమాండ్‌ ఆస్పత్రికి తరలించేందుకు ఆర్మీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-09T16:44:42+05:30 IST