సోలార్ బాధితులు 18 మందికి చెక్కులు పంపిణీ
ABN , First Publish Date - 2020-07-03T10:20:32+05:30 IST
జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం సోలార్ ప్రాజెక్టు కింద భూములు పోయిన దొడియం, లక్కోనుపల్లె
జమ్మలమడుగు రూరల్, జూలై 2: జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం సోలార్ ప్రాజెక్టు కింద భూములు పోయిన దొడియం, లక్కోనుపల్లె గ్రామాలకు చెందిన రైతులు 18 మందికి ఒక్కొక్కరికి రూ.6.30 లక్షలు చొప్పున రూ.2.30కోట్ల చెక్కుల రూపంలో గురువారం ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పంపిణీ చేశారు. ఆర్డీవో కార్యాలయ చాంబర్లో ఆర్డీవో నాగన్న, తహసీల్దారు శివరామయ్య,చేనేత నియోజకవర్గ కన్వీనర్ దుద్యాల రమేష్, వైసీపీ నాయకులు పోరెడ్డి మహేశ్వర్రెడ్డి, దొడియం విష్ణువర్ధన్రెడ్డి, పాల్గొన్నారు.
ఇసుక రీచ్ పరిశీలన
జమ్మలమడుగు మండలంలోని అంబవరం గ్రామ సమీపాన పెన్నానది వద్ద ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను గురువారం ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పరిశీలించారు. ఇటీవల ఇసుక రీచ్లో ఇసుక నాణ్యతగా లేదని విమర్శలు రావడంతో ఆయన రీచ్ వద్దకు వెళ్లి పరిశీలించారు. సచివాలయాల వద్ద ఇసుకను బుక్ చేసుకుంటే ఇసుక ఇంటికే తీసుకొస్తారన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటరామిరెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.