సాప్ట్వేర్ డెవలపర్లుగా ప్రకాశం విద్యార్థులు
ABN , First Publish Date - 2021-04-11T06:40:09+05:30 IST
ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో మైండ్ వేవ్ ఇన్ఫార్మటిక్స్ కంపెనీ శనివారం నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 28 మంది ఫైనలియర్ విద్యార్థులు సాప్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలకు ఎంపికైనట్లు కాలేజీ కరస్పాండెంట్ కంచర్ల రామయ్య, డైరక్టర్ కంచర్ల శ్రీకాంత్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ప్రాంగణ ఎంపికలో 28 మందికి ఉద్యోగాలు
కందుకూరు, ఏప్రిల్ 10: ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో మైండ్ వేవ్ ఇన్ఫార్మటిక్స్ కంపెనీ శనివారం నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 28 మంది ఫైనలియర్ విద్యార్థులు సాప్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలకు ఎంపికైనట్లు కాలేజీ కరస్పాండెంట్ కంచర్ల రామయ్య, డైరక్టర్ కంచర్ల శ్రీకాంత్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఫైనలియర్ రెండవ సెమిస్టర్లో ఆన్లైన్ ద్వారా జరిగే శిక్షణతో విద్యార్థుల ప్రతిభ నైపుణ్యాల ఆధారంగా వారికి రూ.3 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకు వార్షికవేతనంగా నిర్ణయిస్తామని కంపెనీ ప్రతినిఽధి ఎస్. బ్రహ్మయ్య పేర్కొన్నారని వారు తెలిపారు. గత సంవత్సరం ఉత్తీర్ణులైన దాదాపు 10 మంది విద్యార్థులు మంచి వేతనంతో పనిచేస్తున్నారని కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసరు ఆర్.గిరిప్రసాదు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలకు విద్యార్థులు ఎంపికయ్యారని శ్రీకాంత్ తెలిపారు.