సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల విద్యార్థులు 100% పాస్

ABN , First Publish Date - 2022-06-30T23:56:12+05:30 IST

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ లో మాదిరిగానే పదవ తరగతి ఫలితాలలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు.

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల విద్యార్థులు 100% పాస్

హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ లో మాదిరిగానే పదవ తరగతి ఫలితాలలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు.మరోసారి విజయ కేతనం ఎగురేశారు.పదవ తరగతిలో స్టేట్ సరాసరి 90%కాగా,ఈ సొసైటీకి చెందిన విద్యార్థులు 98.14%మంది ఉత్తీర్ణులయ్యారు.ఈ సొసైటీకి చెందిన 18వేల545మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 18వేల200మంది పాసయ్యారు.వీరిలో 287మంది నూటికి నూరు శాతం ( 10/10) మార్కులు సాధించారు.


పదవ తరగతిలో ఈ సొసైటీకి చెందిన 126 స్కూళ్లు 100% ఫలితాలు సాధించాయి.ఎస్సీ గురుకుల పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ లు సంతోషం వ్యక్తం చేశారు.విద్యార్థులు,వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అధికారులు, అధ్యాపకులు, సిబ్బందిని మంత్రి కొప్పుల ఈశ్వర్, కార్యదర్శి రోనాల్డ్ రాస్ లు అభినందించారు.

Updated Date - 2022-06-30T23:56:12+05:30 IST