బీజేపీతోనే సామాజిక న్యాయం

ABN , First Publish Date - 2021-07-31T06:13:12+05:30 IST

బీజేపీతోనే సామాజిక న్యాయం సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి, అ నంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షు డు సందిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు.

బీజేపీతోనే సామాజిక న్యాయం
మోదీ చిత్రపటానికి పలాభిషేకం చేస్తున్న బీజేపీ నాయకులు

అనంతపురం అర్బన్‌, జూలై 30: బీజేపీతోనే సామాజిక న్యాయం సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి, అ నంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షు డు సందిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో టవర్‌క్లాక్‌ వద్ద మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓబీసీ కోటా, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను అమలుచేసిన ప్రఽధా ని నరేంద్రమోదీ ఆయా వర్గాలప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయారన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందేందుకు ఈ రిజర్వేషన్లు ఎంతో దోహదపడ్డాయన్నారు. కార్యక్రమంలో నాయకులు రత్నమయ్య, రామ చంద్రయ్య, దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి, లలిత్‌, మల్లీశ్వరి, రూపా, నాగలక్ష్మి, సూర్యప్రకా్‌షరెడ్డి, శ్రీధర్‌, నాగేంద్ర పాల్గొన్నారు.


Updated Date - 2021-07-31T06:13:12+05:30 IST