రాష్ట్రంలో సామాజిక న్యాయం లోపించింది : జాజుల
ABN , First Publish Date - 2020-11-01T08:48:26+05:30 IST
రాష్ట్రంలో నేడు సామాజిక న్యాయం పూర్తిగా లోపించిందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాజకీయంగా అణగదొక్కి రా జకీయ అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం
కవాడిగూడ, అక్టోబర్ 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నేడు సామాజిక న్యాయం పూర్తిగా లోపించిందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాజకీయంగా అణగదొక్కి రా జకీయ అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివా్స్గౌడ్ ఆరోపించా రు. శనివారం ఇందిరాపార్కు చౌరస్తాలోని బీసీ భవన్లో మహర్షి వాల్మీకి జయంతి, కుమురం భీం వర్ధంతులను బీసీ కుల సం ఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణే్షచారి నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివా్సగౌడ్ మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన మహర్షి వాల్మీకి చాలా గొప్పగా రామాయణాన్ని రాసి చరిత్ర సృష్టించారన్నారు. జల్, జమీల్, జంగల్ కోసం పోరాడి ఆసువులు బాసిన కుమురం భీమ్ ఆశయాలు నేటికీ అమలు కావడం లేదన్నా రు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అర శాతం, అయి దు శాతం జనాభా లేని అగ్రకులాలకు టికెట్లు కేటాయిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో వాల్మీకి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోపి, వివిధ కుల సం ఘాల నేతలు మల్లికార్జున్, రాజేందర్, రంజిత్, అరవింద్, నరేష్, బడేసాబ్ పాల్గొన్నారు.