దళితులను సాంఘిక బహిష్కరణ చేయడం అమానుషం
ABN , First Publish Date - 2021-01-25T05:50:05+05:30 IST
రాయిన్పల్లిలో 15 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల జాయింట్ యా క్షన్ కమిటీ డిమాండ్ చేసింది.
దళిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ
మెదక్, జనవరి 24 : రాయిన్పల్లిలో 15 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల జాయింట్ యా క్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం ‘ఛలో రాయిన్పల్లి’ చేపట్టిన సందర్భంగా వారు మాట్లాడారు. దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామంలో సాంఘిక బహిష్కరణను ఎత్తి వేస్తూ, రూ.12 లక్షల జరిమానాను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు శంకర్, మురళి, హన్మకొండ దయాసాగర్, సంజీవ్, కొండి స్వామి, బాలరాజ్, సురేష్, కల్పన, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.