వ్యాక్సినేషన్ సరే..భౌతికదూరం పాటించరా!
ABN , First Publish Date - 2021-04-11T06:54:24+05:30 IST
ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి వేయించుకోవాలని చెపుతున్న అధికారులు సదరు వ్యాక్సినేషన్ కేంద్రంలో భౌతికదూరాన్ని గాలికి వదిలేశారు.
గుడివాడ(రాజేంద్రనగర్) : ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి వేయించుకోవాలని చెపుతున్న అధికారులు సదరు వ్యాక్సినేషన్ కేంద్రంలో భౌతికదూరాన్ని గాలికి వదిలేశారు. పాత గుడివాడలోని ఏకేటీపీ మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో ఆదివారం కొవిడ్ వ్యాకినేషన్ నిర్వహించారు. అధిక సంఖ్యలో ప్రజలు 45 ఏళ్లు దాటిన వారు ఏ జాగ్రత్తలూ పాటించకుండా, మాస్కు లేకుండా భౌతికదూరం పాటించకుండా ఒకరిని ఒకరినొకరులు నెట్టు కొంటూ వ్యాక్సినేషన్ కేంద్రంలో కన్పించారు. ఇదిలానే కొనసాగితే వ్యాక్సినేషన్ కేంద్రాలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.