కొందరినే కలిసే... ‘సోషల్‌ బబుల్స్‌’ మేలు!

ABN , First Publish Date - 2020-06-16T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌ తొలగింపుతో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు. అయితే ఇలా పెరిగిపోకుండా ఉండేందుకు, సోషల్‌ డిస్టెన్సింగ్‌ కంటే ‘సోషల్‌ బబుల్స్‌’ విధానం తోడ్పడుతుందని పరిశోధనలో తేలింది...

కొందరినే కలిసే... ‘సోషల్‌ బబుల్స్‌’ మేలు!

లాక్‌డౌన్‌ తొలగింపుతో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు. అయితే ఇలా పెరిగిపోకుండా ఉండేందుకు, సోషల్‌ డిస్టెన్సింగ్‌ కంటే ‘సోషల్‌ బబుల్స్‌’ విధానం తోడ్పడుతుందని పరిశోధనలో తేలింది.


సామాజిక దూరం పాటిస్తూ ఎక్కువ మందిని కలిసే విధానం కంటే, తక్కువ మందికే పరిమితమై మసలుకునే విధానం ఎక్కువ ఫలితం చూపిస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. నేచర్‌ హ్యూమన్‌ బిహేవియర్‌ అనే జర్నల్‌లో ఇది ప్రచురితమైంది. అలాగే తరచుగా కలుసుకునే వీలున్న ఇరుగు పొరుగు కూడా సామాజిక నియంత్రణ పాటించగలిగితే కరోనా వ్యాప్తిని సమర్థంగా నియంత్రించవచ్చు. ఇతరులను కలవడాన్ని ప్రణాళికాబద్ధంగా నియంత్రించచుకోగలిగితే చాలు. ఒక పక్క సామాజిక దూరం పాటిస్తూనే... అలాగని ఒంటరిగా కాకుండా నలుగురితో కలిసి జీవించే విధానం అనుసరించిన ఫలం దక్కుతుంది. అదే సమయంలో కరోనా సోకే ప్రమాదాన్నీ తగ్గించుకోగలుగుతామని అధ్యయనకారులు అంటున్నారు. ఇలాంటి ‘సోషల్‌ బబుల్స్‌’ విధానాన్ని ప్రభుత్వాలు ఆచరణలోకి తీసుకురాగలిగితే, సోషల్‌ ఐసొలేషన్‌తో తలెత్తే దుష్పరిణామాలను నియంత్రించవచ్చు. ఇలాంటి ప్రణాళికాబద్ధమైన సోషల్‌ బబుల్స్‌ విధానంతో, దీర్ఘకాలిక లాక్‌డౌన్‌ మూలంగా తలెత్తే మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి. అదే సమయంలో కరోనా వ్యాప్తి కూడా నియంత్రణలోకి వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.


Updated Date - 2020-06-16T05:30:00+05:30 IST