కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పేరుకుపోయిన పొగ మంచు
ABN , First Publish Date - 2021-11-06T14:55:46+05:30 IST
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని రహదారులపై పొగమంచు పేరుకుపోయింది.
కరీంనగర్ జిల్లా: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని రహదారులపై పొగమంచు పేరుకుపోయింది. ఉదయం ఎనిమిదన్నర గంటలు అవుతున్నా.. పొగమంచు అలాగే ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైవేలపై వెళుతున్న వాహనదారులకు ముందున్న దారి కనిపించకుండా పొగమంచు కమ్ముకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ నుంచి జగిత్యాల, వరంగల్ వెళ్లే రహదారిలో పొగమంచు పేరుకుపోయింది. అలాగే హుజురాబాద్లోని చాలా గ్రామాల్లో పొగ మంచు పేరుకుపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.