సెమీస్లో స్నేహిత్
ABN , First Publish Date - 2021-02-23T09:19:02+05:30 IST
జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ కెరటం ఎస్.ఫిడేల్ రఫీక్ స్నేహిత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ కెరటం ఎస్.ఫిడేల్ రఫీక్ స్నేహిత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. హరియాణా లోని పంచకులలో జరుగు తున్న ఈ టోర్నీ తొలి రౌండ్లోనే డిఫెండింగ్ చాంపియన్ హర్మీత్ దేశాయ్కి షాకిచ్చిన స్నేహిత్.. క్వార్టర్స్లో 4-1తో సుష్మిత్ శ్రీరామ్పై నెగ్గాడు. ఇక, టాప్ సీడ్ శరత్ కమల్ 4-1తో మానవ్ టక్కర్పై, రెండో సీడ్ జి.సాథియన్ 5-0తో సునీల్ శెట్టి మీద నెగ్గి సెమీస్ చేరారు.